గ్రంధి దారెటు?

Grandhi Srinivas Joins in BJP: గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మార్మోగింది. పవన్ కళ్యాణ్ నే ఓడించి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు ఆయన. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ నేత సైలెంట్ అయ్యారు. గత ఏడాది డిసంబర్ లో వైసీపీకి గుడ్ చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీతో టచ్ లో లేకుండా ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఏకంగా బీజేపీ కేంద్రం మంత్రి ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కలవడంతో ఆ నేత బీజేపీ గూటికి చేరుతున్నారే టాక్ వినిపిస్తుంది. ఇంతకు ఎవరు ఆ నేత…పొలిటికల్ గా ఆయన దారెటు…

గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యనేత ఆయనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. గతేడాది వైసీపీ గుడ్ బై చెప్పేశారు. ఇక అప్పటి నుంచి ఏపార్టీతో సంబంధం లేదంటూ సైలెంట్ గానే ఉంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగే ఉందండోయ్. అయితే వైసీపీలో ఉన్నప్పటికి ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

గత ప్రభుత్వంలో మినిస్టర్ పదవిని ఆశించినా గ్రంధి ఆశ నెరవేరలేదు. ఇక ఇదే క్రమంలో పార్టీ ఓడిపోవడంతో ఆయన పార్టీలో యాక్టీవ్ గా కనిపించలేదు. గత ఏడాదిలోనే వైసీపీకి గుడ్ బై కూడా చెప్పేశారు ఆయన. ఇక ఈ క్రమంలో గ్రంధి శ్రీనివాస్ టీడీపీ లేకపోతే కమల గూటికి చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఇక ఇదే క్రమంలో ఆయనతో గతంలోనే మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, పేర్ని నాని సమావేశమై చర్చించారు. అయినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీలో కొనసాగలేదు..ఇప్పటి వరకు ఏ పార్టీలోను చేరలేదు ఆయన.

అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే గ్రంధి శ్రీనివాస్ ఇంటికి బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెళ్లినట్టు…గ్రంధి తో ఆయన భేటీ అయ్యారంటూ టాక్ వినిపిస్తుంది. బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్రమంత్రి వర్మ గ్రంధి ఇంటికి వెళ్లి భేటీ అవడంతో రాజకీయాలపై సుధీర్ణంగా చర్చించడంతో హాట్ టాపి గా మారింది. పరామర్శ కోసమే వెళ్లినా పనిలో పనిగా గ్రంధి శ్రీనివాస్‌ను బీజేపీలోకి ఆహ్వానించారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్మ, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణలతో భీమవరంలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంధిని బీజేపీ పార్టీలోకి తీసుకుంటే నరసాపురం నియోజకవర్గంలో కమలం కమలం మరింతగా బలపడుతుందన్న ఆలోచనలో కమలం నాథులు ఉన్నట్లు సమాచారం. అయితే 2019 లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. 2024లో వైసీపీ దరపున జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పై ఓడిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పార్టీ బలోపేతం చేసే దిశలో నరసాపురం పార్లమెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.

నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రంధి శ్రీనివాస్‌ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. . గోదావరి జిల్లాల్లో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ. గ్రంధి శ్రీనివాస్ కాపు లీడర్. మంచి పేరున్న నేత. ఆయన అనుభవం, పరిచయాలు తోడైతే నరసాపురం పార్లమెంట్, భీమవరం అసెంబ్లీ పరిధిలోనే కాదు..గోదావరి జిల్లాల్లో కమల వికాసం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు కమలనాథులు. Grandhi Srinivas Joins in BJP.

అయితే బీజేపీ నేతల ఆహ్వానానికి ఆలోచించి చెప్తానన్నారట గ్రంధి శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం దాదాపుగా కన్ఫామ్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతారా లేదా అన్నది ఆయన అఫిషీయల్‌గా చెప్తే తప్ప క్లారిటీ లేదు. కాకపోతే రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే ఇప్పడే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టీవ్‌గా పనిచేయాలనైతే అనుకుంటున్నారు గ్రంధి శ్రీనివాస్. మరీ ఏం జరగుతుందో వేచి చూద్దాం.