రైల్వే శుభవార్త.!

Indian Bullet Trains: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి బుల్లెట్ రైలు సేవలను విస్తరించే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, బెంగళూరు లకు రెండు వేరు వేరు హై స్పీడ్ రైలు కారిడార్ లకు సంబంధించి తుది సర్వే పనులు కొనసాగుతున్నాయి.ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హై స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ను పాత వాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ ఫీల్డ్ నమూనాలో నిర్మిస్తారు.ఈ మార్గంలో కేవలం బుల్లెట్ రైలు మాత్రమే నడుస్తాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన రైల్వే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలుమార్గాన్ని కాకుండా చెన్నై బెంగళూరు హై స్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేసింది.

రైల్వే అనుబంధ సంస్థ రైట్స్ దీనికి సంబంధించి ప్రాథమికంగా అలైన్మెంట్ లను రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వీటిని ఖరారు చేస్తారు. దీనికి సంబంధించి సర్వే అధికారులు ఇప్పటికే తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ ప్రతిపాదనల పైన చర్చించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట నల్గొండ మీదుగా రెండు పాత రైల్వే మార్గాలు, విజయవాడ హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి 65కూడా అందుబాటులో ఉన్నట్టుగా గుర్తించారు.

హైదరాబాద్​ నుంచి చెన్నైకి కాజీపేట, నల్గొండ మీదుగా రెండు పాత రైల్వే మార్గాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్​-విజయవాడ మధ్య జాతీయ రహదారి 65 కూడా ఉంది. ఈ మూడు మార్గాలపై ప్రాథమికంగా చర్చించినట్లు, కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలిసింది. ఈ లైన్​కు జాతీయ రహదారి వెంట గానీ, నల్గొండ మీదుగా గానీ రెండు మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ హైస్పీడ్​ కారిడార్ల అంశం సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కొద్దిరోజుల క్రితం దిల్లీలో కలిసినప్పుడు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ముంబయి-అహ్మదాబాద్​ ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్​-చెన్నై, హైదరాబాద్​-బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని కేంద్రమంత్రి పేర్కొన్నట్లు సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్​ నుంచి చెన్నై, బెంగళూరులకు రైలు ప్రయాణ సమయం ఇంచుమించు 12-13 గంటలు పడుతుంది. ఆయా నగరాలను మూడు గంటల్లోనే చేరుకునేలా బుల్లెట్​ రైలు ప్రాజెక్టులను డిజైన్​ చేస్తున్నారు. హైస్పీడ్​ బుల్లెట్​ రైలు కారిడార్​ను పాత వాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్​ఫీల్డ్​ నమూనాలో నిర్మిస్తారు. ఈ మార్గంలో కేవలం బుల్లెట్​ రైళ్లే నడుస్తాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్​ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరుతో పాటు కర్నూలు, విజయవాడ, గుంటూరు నగరాలకు ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది. విద్య, ఐటీ, వ్యాపారం రంగాల విస్తరణకు ఈ మార్గాలు ఉపయోగపడతాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.

ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకు బెంగళూరుకు రైలులో ప్రయాణం చేస్తే సమయం సుమారు 12 నుంచి 13 గంటలు పడుతుంది. ఈ నగరాలను మూడు గంటల్లోనే చేరుకునే లాగా బుల్లెట్ రైల్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట నల్గొండ మీదుగా రెండు పాత రైల్వే మార్గాలు, విజయవాడ హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి 65కూడా అందుబాటులో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక ఈ మూడు మార్గాలలో హై స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా చర్చలు చేశారని కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అయిందని సమాచారం. ఇక ఈ రైల్వే కారిడార్ కు ఎన్ హెచ్ 65 వెంటనే, నల్గొండ మీదుగా గాని రెండు మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్​-ముంబయి హైస్పీడ్​ కారిడార్​ డీపీఆర్​లో మొత్తం 11 స్టేషన్లను ప్రతిపాదించగా, రాష్ట్రంలో సుమారు 170 కి.మీ. పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో రెండు స్టేషన్లు హైదరాబాద్​, జహీరాబాద్​ ఉన్నాయి. కేంద్ర కేబినెట్​ కమిటీ ఆన్​ ఎకనామిక్​ ఎఫైర్స్​ ఆమోదించిన తర్వాత భూసేకరణ, నిధుల మంజూరు వంటి ప్రక్రియలను మొదలు పెడతారు. దీనితో పాటు చెన్నై, బెంగళూరు మార్గాలను కలిపితే రాష్ట్రంలో హైస్పీడ్​ కారిడార్​ దూరం 580 కి.మీ.గా ఉండనుంది. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు 3 గంటల్లో చేరుకునేలా ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. Indian Bullet Trains.

ఈ ప్రాజెక్ట్ లతో ప్రయాణం సులభం ఈ మూడు ప్రాజెక్టులు వస్తే హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా ప్రయాణం మరింత సులభం అవుతుంది.సో మూడు గంటల్లో మీ గమ్యానికి చేరుకుంటారు. దీంతో మీ టైం కూడా సేవ్ అవుతుంది.