రణరంగమే.!

Nepal Gen Z Protest: సోషల్ మీడియా బ్యాన్ నేపాల్ ను రణరంగంలా మార్చింది. యువతరం మొత్తం నేపాల్ పార్లమెంట్ ను ధిగ్భందించింది. దీనితో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అసలు అక్కడ జరిగిన ఘర్షణలకు కారణం ఏంటి.? అక్కడ అసలు ఎం జరిగింది. తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్‌ జెడ్‌ ఆందోళనకారులు కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఈ నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ అలెర్ట్ అయ్యింది . ఈ మేరకు నేపాల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది . చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక దీంతో రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు.

అసలు జరిగిన విషయం ఏమిటి అంటే కమ్యూనికేషన్స్‌, సమాచార టెక్నాలజీ మంత్రిత్వశాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకోని కారణంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌తోసహా 26 సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని సెప్టెంబర్‌ 4న ఓలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జనరేషన్‌ జెడ్‌ ఉద్యమాన్ని రగిల్చింది. రెగ్యులేటరీ నిబంధనల మేరకు తాము యాప్‌ల నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కేందుకు చేపట్టిన సెన్సార్‌షిప్‌ చర్యగా యువజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ సర్వీసులను అడ్డుకుని, సోషల్‌ మీడియా యాప్‌లను నిషేధించినప్పటికీ జనరేషన్‌ జెడ్‌ ఉద్యమకారులు టిక్‌టాక్‌, రెడిట్‌ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేలాదిమంది యువజనులను సమీకరించారు.

ఇక దీంతో నేపాల్ లోని అవినీతి, నిరంకుశత్వం, జవాబుదారీతనం లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ విస్తృత ఉద్యమంగా మారాయి. పార్లమెంట్ సమీపంలో పోలీసులతో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తతలు పెరగడంతో ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. రాత్రి 10 గంటలకు వరకూ నగర వ్యాప్త కర్ఫ్యూ విధించింది. ఇది ఇటీవల సంవత్సరాలలో నేపాల్ లో యువత నేతృత్వంలో జరిగిన అతిపెద్ద నిరసనగా నిలిచింది.

అసలు నిషేధం ఎందుకు విధించింది అంటే ప్రభుత్వం ప్రకారం.. ప్లాట్ ఫాం కమ్యూనికేషన్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవడంలో ఆలసత్వం చేయడంతో నిషేధం విధించింది. అధికారులు ఈ చర్యను నియంత్రణ విషయంగా చెబుతున్నారు.అయితే నిరసనకారులు దీనిని సెన్సార్ షిప్, విమర్శనాత్మక స్వరాలను వినిపించకుండా చేయడానికి, భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నంగా భావించారు. ఆ అవగాహాన ఆన్ లైన్ ప్లాట్ ఫాం స్వేచ్ఛా వ్యక్తీకరణకు అవసరమైన ఫ్లాట్ ఫాంగా భావిస్తున్న యువతలో కోపాన్ని రేకెత్తించింది.

ఇక నేపాల్ ప్రధాని కేపీ ఓలి తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘‘దేశాన్ని అణగదొక్కే ఏ ప్రయత్నాన్ని కూడా ఎప్పటికే సహించేది లేదన్నారు.. దేశ స్వాతంత్య్రం అనేది కొంతమంది వ్యక్తుల ఉద్యోగాల నష్టం కంటే గొప్పదని . చట్టాన్ని ధిక్కరించడం, రాజ్యాంగాన్ని విస్మరించడం, జాతీయ గౌరవం, స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడం ఎలా ఆమోదయోగ్యం?’’ అని అన్నారు.

గత ఏడాది నేపాల్ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆగష్టు 28 నుంచి ఏడు రోజుల పాటు సోషల్ మీడియా కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. కానీ గడువు ముగిసినప్పటికీ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ , యూ ట్యూబ్, గూగూల్, ఎక్స్, రెడ్డిట్, లింక్డ్ ఇన్ వంటివి ఏవి కూడా దరఖాస్తు చేసుకోలేదు. నేపాల్ డిజిటల్ ప్లాట్ ఫాంలను వ్యతిరేకించడం ఇదేం తొలిసారి కాదు. జూలైలో ఆన్ లైన్ మోసాలు, మనీలాండరింగ్ చేస్తున్నారంటూ టెలిగ్రామ్ ను బ్లాక్ చేసింది. అంతకుముందు ఆగష్టు 2024 లో నేపాలీ నిబంధనలు పాటించడానికి టిక్ టాక్ అంగీకరించడంతో దానిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. Nepal Gen Z Protest.

ఇక దీంతో పెద్ద పోరాటమే జరిగింది. ఖాట్మండ్ లో రాత్రి సమయంలో, నిరసనలు, యాప్ లను యాక్సెస్ చేయడం పెద్ద యుద్ధంగా మారిపోయాయి. ఈ ఉద్యమం ఇప్పుడు స్వేచ్చా, జవాబుదారీతనం, నేపాల్ ప్రజాస్వామ్య భవిష్యత్ గురించి ఆందోళనలు వెల్లువెత్తాయి. రాజధాని వీధులు సమాధానం లేని ప్రశ్నను ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వం తన యువత డిమాండ్లను పట్టించుకునే పరిస్థితి ఉందా లేకపోతే ఈ నిరసన స్వరాలు ఇంకా బలంగా పెరుగుతాయా? అనేది వేచి చూడాలి.