బీజేపీ పార్టీలో హైకమాండ్​కు తలనొప్పిగా మారిన విషయాలేంటి..?

Telangana State BJP: రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయితీలు ఆ పార్టీ హైకమాండ్​కు తలనొప్పిగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే -రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో.. ఇంతలోనే మరో పంచాయితీ తెరమీదికి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇది పార్టీ కేడర్​ను అయోమయానికి గురిచేస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల టైమ్ దగ్గరపడ్తున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయితీ వారిని కలవరపెడ్తున్నది. ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్​ ఆరా తీస్తున్నది.

బండి సంజయ్​, ఈటల రాజేందర్​ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్​ ఉన్నట్లు పొలిటికల్​ సర్కిల్​లో చర్చ జరుగుతున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్​ని పార్టీ అధిష్టానం తప్పించింది. దీనికి ఈటల కూడా ఒక రీజన్ అని సంజయ్​ వర్గీయులు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల ఉండగా.. ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీనికి బండి సంజయ్ కారణమని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. Telangana State BJP.

బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్‌‌‌‌‌‌‌‌ లో ఇటీవల టెన్త్ స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని ఇన్ డైరెక్ట్​గా ఆయన వర్గీయులకు బండి సంజయ్​ వార్నింగ్ ఇచ్చినట్టు నేతలు చెప్తున్నారు. ఇదే క్రమంలో కొత్త కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని ఈటల వర్గీయులు ఫైర్ మీద ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఈటల వర్గానికి చెందిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డి రాజీనామా చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాలో బిజెపి పార్టీ ఎంపీ స్థానంతో మంచి ఊపు మీద కనిపించింది. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కీలక కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి బిజెపి పార్టీలో చేరారు. ఆయన బీజేపీలో చేరడంతో ఒకపక్క బండి సంజయ్ అధ్యక్షనలో మరోపక్క ఈటెల రాజేందర్ తో బిజెపి పార్టీ పుంజుకుంటుందని కార్యకర్తలు సంబరపడ్డారు. ఇద్దరు కలిసి రాష్ట్ర పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని లేపారు. పార్టీ కార్యకర్త మనసుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తుందని ఆలోచనలు తెప్పించారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకొని మంచి జోరు మీద కనిపించింది.

రెండ్రోజుల కింద హుజూరాబాద్ సెగ్మెంట్​లోని ఈటల అనుచరులంతా శామీర్‌‌‌‌‌‌‌‌ పేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న బాధలను చెప్పుకున్నారు. ఇందులో నేరుగా బండి సంజయ్​పేరు ప్రస్తావించకుండా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గుర్తించి టికెట్ ఇస్తే సరే లేదంటే.. హుజూరాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో తమ సర్పంచ్ ఉంటారని ఆయన ప్రకటించారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా.. ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్​పర్సన్​ వరకు అన్నింటిలో పోటీలో తమ వాళ్లు ఉంటారని వార్నింగ్ ఇచ్చారు.

మౌనంగా ఉండే వాన్ని బలహీనుడిగా చూడొద్దని, తన జోలికి రావద్దని వ్యాఖ్యలు చేశారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగనుండగా.. ఇలాంటి టైమ్​లో ఇద్దరు కీలక నేతల నడుమ కోల్డ్​ వార్​ బీజేపీ కేడర్​ను కలవరపెడుతుంది. మరి వీరిద్దరి మధ్య రాచ్చుకున్న చిచ్చు రాష్ట్రంలోనే తగ్గుతుందా లేదా కేంద్రం వరకు చేరుకుంటుందా…అధిష్టానం బండి సంజయ్ కి మొట్టికాయ కొడుతుందా లేక ఈటెల రాజేందర్ కు వార్నింగ్ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/telangana/there-are-reports-that-congress-workers-are-expressing-anger-over-the-behavior-of-palakurthi-mla-yashaswini-reddys-mother-in-law-jhansi-reddy/