
No Helmet No Fuel: మీరు టూ వీలర్ మీద హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్కి వెళ్తే మీకు పెట్రోల్ పోయరు. ఇది అక్షరాల సత్యం. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. దీంతో పలువురు ప్రమాదాల భారీన పడుతున్నారు. అయితే ఈ విధానానికి చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చించి ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
నిజానికి ఈ కొత్త రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ ను ఎప్పటినుంచో అమలు చేస్తామని చెబుతోన్న ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ నుంచి అమలు చేయడానికి రెడీ అయ్యింది. అయితే నో హెల్మెట్, నో ఫ్యూయల్ విధానాన్ని సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలు చేస్తారు. అంటే ఎవరైనా హెల్మెట్ లేకుండా టూ వీలర్ మీద పెట్రోల్ బంక్కి వెళ్తే మీకు పెట్రోల్ పోయరన్నమాట. టూ వీలర్ రైడర్స్తో పాటు వెనుక కూర్చునే పిలియన్ రైడర్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యమని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
అయితే ఈ క్యాంపెయిన్ను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ అంటే జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే, రాష్ట్రమంతటా ఒకే రకమైన రూల్స్, ఒకే రకమైన అమలు ఉండేలా చూస్తారు. ఎక్కడైనా టూ వీలర్ మీదా వెళ్లేవారు హెల్మెట్ లేకుండా కనిపిస్తే, ఇక వాళ్లకు పెట్రోల్ పోయడం కష్టమే.
నిజానికి మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని సెక్షన్ 129 ప్రకారం, టూ-వీలర్ రైడర్తో పాటు వెనుక కూర్చునే వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే, సెక్షన్ 194D ప్రకారం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా హెల్మెట్ వాడకం పెంచాలని చాలా సార్లు సూచించింది. అందుకే ఈ క్యాంపెయిన్ను మరింత స్ట్రాంగ్ గా అమలు చేయాలని చూస్తున్నారు. ఈ క్యాంపెయిన్లో పెట్రోల్ బంక్లు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. IOCL, BPCL, HPCL వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోల్ పంప్ స్టాఫ్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వొద్దు అని ఖరా ఖండిగా చెప్పేశారు.
అంటే, హెల్మెట్ లేకుండా బైక్ తీసుకొచ్చి పెట్రోల్ పోయాలని అడిగితే నో చెప్పడం బంక్ సిబ్బంది ధర్మం. మేం ఎవరినీ శిక్షించడానికి ఈ రూల్ తేలేదని, ప్రజల ప్రాణాలు కాపాడడమే మా లక్ష్యమని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ అన్నారు. ఈ కొత్త రూల్ స్పందనను బట్టి పొడిగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. నెల రోజుల అమలు తర్వాత వాహనదారులు తప్పకుండా దాన్ని కంటీన్యూ చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్యాంపెయిన్ను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ నేరుగా సూపర్వైజ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలతో కలిసి పోలీసులు, రెవెన్యూ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి కష్టపడుతున్నారు. అంటే, రాష్ట్రమంతటా ఒకే రకమైన రూల్స్, ఒకే రకమైన అమలు ఉంటుంది. ఎక్కడైనా టూ, వీలర్ వెళ్లేవారు హెల్మెట్ లేకుండా కనిపిస్తే, ఇక వాళ్లకు ఫ్యూయల్ దొరకదని చెప్పవచ్చు. No Helmet No Fuel.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల మన జీవితమే కాదు, మన కుటుంబానికి కూడా భద్రత కలుగుతుంది అనే సందేశాన్ని ఈ చర్య ద్వారా స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నారు అధికారులు. ఇందుకు తోడు, ఇలాంటి విధానాలు ఇతర ప్రాంతాల్లోనూ అమలవుతే రోడ్డుప్రమాదాల్లో మరణాల రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q