
Pakistan Terrorist Bases: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసినప్పటికీ దాయది దేశం బుద్ధి మాత్రం మారలేదు. తన వక్రబుద్ధి పోనిచ్చుకోని పాకిస్తాన్ ఇప్పుడీ ఉగ్ర స్థావరాల పునర్నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తోంది. అది కూడా వరద బాధితుల నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్, పహల్గామ్ వ్యాలీలో ఉగ్రవాదులు సామాన్యులపై దాడి చేసి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ మారణహోమంలో 26 మంది అమాయకులైన పర్యాటకులు చనిపోయారు. ఇందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టారు. అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. పలువురు ఉగ్రవాదులను హతమార్చింది. ప్రపంచదేశాలు సైతం పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. నేరుగా, పరోక్షంగా పాకిప్తాన్ను విమర్శించాయి. ఇంత జరిగిన తర్వాత అయినా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుందా అంటే లేదు. ఆపరేషన్ సిందూర్లో ధ్వంసం అయిన ఉగ్రస్థావరాలను తిరిగి నిర్మించుకుంటుంది. వాటి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించి.. తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది దాయాది దేశం.
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా లష్కరే ఉగ్రవాదుల ప్రధాన క్యాంప్ కార్యాలయం మర్కాజ్ తోయిబా పూర్తిగా ధ్వంసం అయ్యింది. అయితే తాజాగా పాక్ ప్రభుత్వం.. ఈ ఉగ్రవాద క్యాంప్ కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటుందని సమాచారం. పైగా మరో దారణమైన విషయం ఏంటంటే.. వరద బాధితులను ఆదుకునేందుకు సేకరించిన నిధులును ఇలా ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఆ ప్రాంతంలో ధ్వంసమైన లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం విభాగాలు తొలగించేందుకు దాన్ని చుట్టూ భారీ యంత్రాలు మోహరించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉగ్ర సంస్థ కార్యాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్లీ అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా ఉపయోగించనున్నట్లు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసమైన LETకి ఆగస్టులో పాకిస్థాన్ ప్రభుత్వం రూ.1.25 కోట్ల నిధులు అందించింది. అయితే దీని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం సుమారు రూ.4.7 కోట్లకు పైగా ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయి.
అయితే దీనికోసం నిధులు సేకరించేందుకు పాకిస్థాన్ కుట్రకు పాల్పడుతోంది. ఇందుకోసం వరద ప్రభావిత ప్రాంతల సాయం పేరుతో విరాళాలు సేకరించి ఉగ్రసంస్థలకు నిధులు మళ్లిస్తోంది. అయితే పాక్ ఇలాంటి దొంగబుద్ధికి పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. 2005లో పాక్లో భారీ భూకంపం సంభవించింది. అప్పుడు కూడా బాధితులకు సాయం పేరుతో ఇలానే నిధులు సేకరించి ఉగ్రసంస్థలకు నిధులు మళ్లించినట్లు భారత వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో ఇలా మానవతా సాయం పేరుతో సేకరించిన బిలియన్ డాలర్లు నగదులో దాదాపు 80 శాతాన్ని ఉగ్రసంస్థ LETలో మౌలిక సదుపాయాల కోసం మళ్లించినట్లు పేర్కొన్నాయి .
ఇదిలాఉండగా మురీద్కేలో మర్కాజ్ అనేది ఒక పెద్ద ఉగ్రస్థావరం. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించి ఉన్న లష్కరే క్యాంపు కార్యాలయం సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో మార్కెట్, మదర్సా వంటివి కూడా ఉన్నాయి. ఇలా ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపే కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు వెయ్యి మంది దాకా ఇక్కడ ఉగ్ర శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో అతిథి గృహ నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షల విరాళం ఇచ్చాడు.
లష్కరే హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణ చర్యలకు సంబంధించి దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయని ఇండియన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. మర్కాజ్తో పాటు మురిద్కే స్థావరాన్ని కూడా ఉగ్రవాద సంస్థలు పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థలకు పాక్ నిధులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026, ఫిబ్రవరి నాటికి ఈ ఉగ్రస్థావరం పూర్తిగా రెడీ కానున్నట్లు తెలుస్తోంది. అలానే 2019 బాలా కోట్ దాడి తర్వాత మూతపడ్డ లష్కరే తోయిబా సంస్థకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే 2 ఉగ్రవాద శిబిరాలను పాక్ ఇటీవల తిరిగి పునరుద్ధరించింది. ప్రస్తుతం ఈ రెండింటిలో ఉగ్రవాద కార్యకలపాలు మొదలైనట్లు సమాచారం.అలానే లష్కరే తోయిబా సంస్థ.. ఉగ్రవాదుల బస కోసం 4 చిన్న తాత్కాలిక టిన్లను, ఓ కొత్త వాచ్ టవర్ను కూడా నిర్మించింది. వీటికి సంబంధించిన చిత్రాలు ఇటీవల బయటకు వచ్చాయి. Pakistan Terrorist Bases.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మురిద్కేలోని లష్కరే తాయిబా హెడ్ క్వార్టర్స్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అలానే ఉగ్రవాదుల ఆయుధాగారాలు, శిక్షణ కేంద్రాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాక్ఈ లష్కరే సంస్థ పునర్నిర్మాణానికి నేరుగా నిధులు రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026, ఫిబ్రవరి 5 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.