ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం త్వరలో వారి అకౌంట్లోకి రూ.50వేలు.!

AP Government Financial Assistance: ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన కర్నూలు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హెక్టారుకు 50వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించి రైతులకు ఊరట కల్పించింది. ఇందులో కేంద్రం నుంచి 17వేల500, రాష్ట్రం నుంచి 32వేల500 సాయం లభించనుంది. ఇప్పటికే మామిడి, పొగాకు, కోకో, టమాటా, కాఫీ రైతుల సమస్యలకు అండగా నిలిచిన ప్రభుత్వం ఇప్పుడు ఉల్లి రైతుకు కూడా ఆసరాగా నిలుస్తున్నారు. మరి ఈ డబ్బులను రైతు ఎలా పొందాలి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధరల పతనంతో ఇబ్బందులు పడుతున్న ఉల్లి రైతులకు ఆర్థిక భరోసా అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉల్లిని క్వింటా 1200 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం..రైతుల కోసం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉల్లిని పండించిన ప్రతి రైతుకు హెక్టార్‌‌కు 50 వేల రూపాయలు చొప్పున చెల్లించాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉల్లిని ఎవరికి అమ్మారు, ఎంత ధరకు అమ్మారనే విషయంతో సంబంధం లేకుండా ఉల్లి పంట పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు 50 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ఉల్లి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన ఈ సాయంలో కేంద్ర ప్రభుత్వం హెక్టారుకు 17వేల500 చెల్లించనుంది. వైపరీత్యాల నిధుల కింద కేంద్రం ఈ సాయం అందిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెక్టారుకు 32వేల 500 సాయం అందనుంది. మొత్తంగా హెక్టారుకు 50వేల సాయం అందనుంది. నేరుగా ఉల్లి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ సొమ్ము జమ చేయనున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులపై ఇప్పటికే అధికారుల సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అర్హులైన రైతులకు 50 వేల సాయాన్ని అందిస్తారు. AP Government Financial Assistance.

గత కొన్ని రోజులుగా ఉల్లి రైతులు గిట్టుబాటు ధర రాక దిగాలుగా ఉన్నారు. ఉల్లిని కొనడానికి వ్యాపారస్తులు ముందుకు రాకపోవటంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోనే ఉల్లి బస్తాలను వదిలేసిన వెల్లిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఉల్లి రైతులకు ఉపశమనం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం.. క్వింటా ఉల్లికి 1200 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా ఉల్లి రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే. మిగతా మొత్తాన్ని మార్క్ ఫెడ్ రైతులకు చెల్లించనుంది. అలాగే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని రైతుబజార్లకు తరలించి.. విక్రయిస్తున్నారు. మిగతా ఉల్లిని బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తున్నారు. అయితే బహిరంగ వేలంలో ఉల్లి కిలో రూపాయి కూడా పలకని పరిస్థితి మొన్నటి వరకూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులను ఆదుకునేందుకు ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టారుకు 50 వేల చొప్పున అందించాలని నిర్ణయించింది.