బ్యానర్ వివాదం.!

‘I Love Muhammed’ banner controversy: ‘ఐ లవ్ మొహమ్మద్’ బ్యానర్ వివాదమేంటి, యూపీ నుంచి గోద్రా వరకు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఏం జరుగుతుంది. తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బారావఫాత్ అంటే ఈద్ మిలాద్-ఉన్-నబి సందర్భంగా ‘ఐ లవ్ మొహమ్మద్’ బ్యానర్ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీంతో యూపీతోపాటు దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలపైనా కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ‘ఐ లవ్ మొహమ్మద్’ అనే బ్యానర్‌తో నిర్వహిస్తున్న ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇక అటూ కాశీపూర్ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేశారు.

యూపీలోని ఉన్నావ్‌లోనూ ఇలాంటి ఊరేగింపు నిర్వహించినందుకు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమ మత స్వేచ్ఛను వ్యక్తం చేసినందుకు పోలీసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే, “ఐ లవ్ మొహమ్మద్” బ్యానర్ ఏర్పాటు చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాన్పూర్ పోలీసులు చెబుతున్నారు. ప్రదర్శనకారులు నిర్దేశిత స్థలంలో కాకుండా వేరేచోట టెంట్ ఏర్పాటు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మత విశ్వాసాల ఆధారంగా ఎవరినీ టార్గెట్ చేసుకోలేదు” అని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి అన్నారు.

“ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించే సంప్రదాయ బారావఫాత్ ఊరేగింపును రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్వహించాల్సి ఉంది. దీని కోసం స్థానిక ముస్లింలు నిర్దేశించిన స్థలంలో కాకుండా వేరేచోట టెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ “ఐ లవ్ మొహమ్మద్” అనే బ్యానర్‌ ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. తర్వాత రెండు వర్గాల పరస్పర అంగీకారంతో ఎప్పుడూ పెట్టే స్థలంలోనే బ్యానర్ ఏర్పాటు చేశారు” అని కాన్పూర్ వెస్ట్ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు.”ఐ లవ్ మొహమ్మద్” అన్న బ్యానర్ ప్రదర్శించినందుకు కేసు నమోదు చేయలేదని, ఊరేగింపు సమయంలో మరో వర్గానికి చెందిన పోస్టర్లు చించి వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం, “ఐ లవ్ మొహమ్మద్” అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శించడం ద్వారా ముస్లిం సమాజం కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించింది. దీనిని మరో వర్గం వ్యతిరేకించింది. ఊరేగింపు సమయంలో మోహరించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక ఊరేగింపు సమయంలో, ఇతర వర్గాల మతపరమైన పోస్టర్లను చించివేశారని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. కాన్పూర్‌లోని రావత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 299 కింద కేసు నమోదైంది.ఇందులో రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రగిలించడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు. ఊరేగింపు నిర్వాహకులతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు.అయితే, ఎవరినీ అరెస్టు చేయలేదని కాన్పూర్ పోలీసులు తెలిపారు.ఈ కేసు విషయంలో కాన్పూర్ పోలీసుల్ని ట్యాగ్ చేస్తూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబర్ 15న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. “ఐ లవ్ మొహమ్మద్, కాన్పూర్ పోలీసులారా ఇది నేరం కాదు. ఒకవేళ నేరమైతే ఏ శిక్షకైనా నేను సిద్ధం” అని అందులో రాశారు.

లఖ్‌నవూలో కొంతమంది మహిళలు ‘ఐ లవ్ మొహమ్మద్’ అని రాసిన బ్యానర్లు పట్టుకుని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గేట్ నంబర్ 4 ఎదుట ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనకు సమాజ్‌వాదీ నాయకుడు మునవ్వర్ రాణా కుమార్తె సుమేయా రాణా నాయకత్వం వహించారు. చాలా మంది యువకులు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని అనుకున్నారు, కానీ పోలీసులు వారిని దారిలో అడ్డుకున్నారు” అని సుమేయా చెప్పారు.
మహిళలందరూ కార్లలో అసెంబ్లీకి చేరుకుని తమ నిరసనలు తెలిపారు. నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన యువకులను పోలీసులు కొన్ని గంటల పాటు అదుపులో ఉంచుకున్నారని సుమేయా చెప్పారు.
అయితే, లఖ్‌నవూ పోలీసులు వారిపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదని…ముస్లింలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టారు. ముస్లింలు రాజ్యాంగ పరిధిలో వారి మతపరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తే కేసులు పెడతారని…. ముస్లింల మనోభావాలను అణచివేసే ప్రయత్నాలను సహించేది లేదు” అని సుమేయా అన్నారు.

ఇక కాన్పూర్‌లో ముస్లింలపై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ యూపీలోని ఉన్నావ్ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
నిరసనకారులను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది.ఉన్నావ్‌లోని గంగాఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ‘ఐ లవ్ మొహమ్మద్’ అని రాసి ఉన్న బ్యానర్లు పట్టుకున్న పిల్లలు, మహిళలు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక నగరంలో సెక్షన్ 163 అమల్లో ఉంది. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ఆందోళనలు, ప్రదర్శనలు చేపట్టకూడదనే ఆంక్షలు ఉన్నాయని ఉన్నావ్ నార్త్ ఏపీపీ అఖిలేష్ తెలిపారు. అయితే గంగాఘాట్ దగ్గర అనుమతి లేకుండా ప్రదర్శన చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగా ఉందని, పోలీసులు పహారా కొనసాగుతోందని ఆయన తెలిపారు.

ఇక ఈ ఘటనలపై స్పందించిన యూపీ మంత్రి ధరంపాల్ సింగ్ “చట్టాన్ని ఉల్లంఘించే వారిని సహించేది లేదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని ఈ కేసుల్లో దర్యాప్తు జరుగుతుంది” అని అన్నారు. ఇంత జరగుతున్నా కూడా ముస్లి ప్రజల తీరు షరా మామూలే అన్నట్టుగా ఉంది. కాశీపూర్‌ పట్టణంలోనూ స్థానిక ముస్లింలు ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఇందులో ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అదనపు బలగాలను మోహరించారు. స్థానిక ముస్లింల ఊరేగింపు గురించి తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతమంది యువకులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు” అని అబూబకర్ చెప్పారు.పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా 400 మంది పెద్ద ఊరేగింపు చేపట్టారు. వాళ్లను అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన నదీమ్ అక్తర్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు ఉదమ్ సింగ్ నగర్ ఎస్పీ మణికాంత్ మిశ్రా చెప్పారు. దీని వెనుక ఇంకా ఎవరున్నారనే దానిపై నదీమ్‌ను ప్రశ్నిస్తున్నామన్నారు.

ఐ లవ్ మొహమ్మద్ వివాదం తర్వాత గుజరాత్‌లోని గోద్రా, ముంబయిలో నిరసనలు జరిగాయి. వీటిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరిని అరెస్టు చేశారు. గోద్రాలో, పోలీస్ స్టేషన్ ఎదుట విధ్వంసానికి పాల్పడిన 87 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్థానిక యువకుడు జకీర్ బాబా ‘ఐ లవ్ మొహమ్మద్’ వివాదం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని, తర్వాత వదిలేశారు. పోలీసులు విడిచిపెట్టిన అనంతరం, తనను పోలీసులు వేధించారని జకీర్ బాబా మరో పోస్ట్ పెట్టారు. పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

“అల్లరి మూకలు నాల్గో నంబర్ అవుట్‌పోస్ట్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశామని పంచమహల్ జిల్లా ఎస్పీ డాక్టర్ హరేష్ దుధత్ చెప్పారు.”జకీర్ బాబా నిరంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. నవరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని అభ్యంతకరమైన పోస్టులు పెట్టవద్దని చెప్పేందుకు పోలీసులు అతనిని పిలిచారు. అయితే, పోలీసులు అతన్ని కొట్టారని తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది” అని ఎస్పీ అన్నారు. ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో కొంతమంది ర్యాలీ చేపట్టారు. అయితే ,అనుమతి లేకుండా ప్రదర్శన చేస్తున్న వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు” అని స్థానికులు తెలిపారు. ‘I Love Muhammed’ banner controversy.

“కాన్పూర్‌ సంఘటన ముస్లింలలో ఆగ్రహాన్ని పెంచింది. ఇది మొదటిసారి కాదు. రంజాన్ మాసంలో ఇంట్లో నమాజ్ చేసినందుకు మొరాదాబాద్‌లో కేసు నమోదైంది. తర్వాత ఇంటి పైకప్పు మీద నమాజ్ చేయకుండా నిరోధించారు. ఇప్పుడు, ప్రవక్త పోస్టర్‌ ప్రదర్శిస్తే కేసు పెట్టారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారి మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. చిన్న సంఘటనలను పెద్దవిగా చేసి చూపిస్తూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సంఘటనలో ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.