బర్నింగ్ టాపిక్‌తో ఆగస్టు 1న రాబోతున్న ‘థాంక్యూ డియర్’

Thank You Dear మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కృష్ణ వంశీ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా ఆగస్టు 1న విడుదల అవుతున్న చిత్రం “థాంక్యూ డియర్”. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్, త్రంత మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎలిమెంట్స్, కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే తో వరల్డ్ బర్నింగ్ ఇష్యూ గురించి వివరించిన ఈ చిత్రం విడుదల కాకముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక 15th గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్‌తో పాటు, హెబ్బా పటేల్ ఉత్తమ నటిగా, డెబ్యూ ప్రొడ్యూసర్‌గా పప్పు బాలాజీ రెడ్డి, సహాయ నటీనటులుగా నాగ మహేష్ , రేఖ నిరోషా అవార్డ్స్ పొందారు. ఈ చిత్రంలో రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్, మీనాకుమారి, బేబీ ప్రభావతి, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు, వీనిషా, వర్దిని, పప్పు చందు తదితరులు నటించగా పీఎల్‌కే రెడ్డి డీఓపీగా పని చేశారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాను ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ను తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఫ్యామిలీ అంతా చూసే విధంగా చేసాము. సినిమాలో కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే లో ఉండబోతుంది. ఒక మంచి సందేశం తో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను ఉండబోతుంది. అలాగే చిత్రానికి ఇప్పటికే ఎన్నో అవార్డులు రావడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత బాలాజీ మాట్లాడుతూ… ‘‘ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నాను. చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక బృందం అంతా సినిమాకు బాగా సపోర్ట్ చేశారు’’ అన్నారు.

హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ… ‘‘నాకు తన తొలి చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గారితో అలాగే రేఖా నిరోషా గారితో కలిసి పని చేయడం అనేది సంతోషకరం. ఈ సినిమా నాకు స్పెషల్ గా ఉంటుంది. ఆగస్టు 1వ తేదీన మా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.’’ అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ… ‘‘నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి ధన్యవాదాలు. నాతో కలిసి నటించిన ధనుష్ గారికి, హెబ్బా గారికి థాంక్స్. మా సినిమాను అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకులంతా థియేటర్లలో మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాకు పనిచేసే సమయంలో బాలాజీ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడంతోనే మేము బాగా పని చేయగలిగాము. ఇటువంటి మరెన్నో సినిమాలు ఆయన చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. Thank You Dear