
Khalistani terrorists: ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఈ బెదిరింపులకు పాల్పడింది. భారత హై కమిషనర్ దినేష్ పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు విడుదల చేయడం వేయాల్సిందే.. విశేషం… ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది… వారు ఏం వార్నింగ్ లు ఇచ్చారో తెలుసుకోవాలంటే ఓ లుక్
ఖలిస్థానీ సంస్థ ‘సిఫ్స్ ఫర్ జస్టిస్’ మరోసారి రెచ్చిపోయింది. వాంకోవర్లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని రేపు ముట్టడించి, సీజ్ చేస్తామని బెదిరించింది. సిక్కు తీవ్రవాది నిజ్జర్ హత్యకు భారత్ కారణమని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికంటే కొన్ని గంటల ముందే.. కెనడాలో ఖలిస్థానీ గ్రూపులకు ఆర్థిక సహాయం అందుతోందని కెనడా ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. ఈ బెదిరింపులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సిక్కు తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
సోషల్ మీడియా వేదికగా సిఫ్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఈ బెదిరింపులకు పాల్పడింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ పోస్టులో.. సెప్టెంబర్ 18వ తేదీన భారత కాన్సులేట్ను ముట్టడించబోతున్నట్లు చెప్పింది. ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దని కూడా తెలిపింది. అంతేకాకుండా భారత హైకమిషనర్ దినేశ్ కె. పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. దీంతో ఇది కాస్తా అంతర్జాతీయ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ తాజా బెదిరింపులు కెనడా ప్రభుత్వం చేసిన ఒక కీలక ప్రకటన తర్వాత వెలువడటం గమనార్హం. కెనడా ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక నివేదికలో ఖలిస్థానీ తీవ్రవాద గ్రూపులకు కెనడా నుంచే ఆర్థిక సహాయం అందుతోందని మొదటి సారిగా అంగీకరించింది. ‘ది 2025 అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్’ పేరుతో విడుదలైన ఈ నివేదిక.. కెనడా గడ్డపై స్వేచ్చగా పని హెచ్చరికలు జారీ చేసింది. చేస్తున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖలిస్థానీ సంస్థల టెర్రర్ ఫైనాన్సింగ్ పై
అనేక సంవత్సరాలుగా.. బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలకు కెనడాలో సురక్షిత ఆశ్రయం లభిస్తుందని భారత్ వాదిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఒట్టావా ప్రభుత్వం ఈ సంస్థలు, అలాగే హమాస్, హిజ్బుల్లా వంటి ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా తమ తీవ్రవాద దుర్వినియోగం చేస్తున్నాయని అంగీకరించింది. ఎజెండా కోసం కెనడియన్ ఫండింగ్ నెట్వర్క్లు, స్వచ్ఛంద సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలను Khalistani terrorists.
కెనడాలోని భారతీయ దౌత్య కార్యాలయాలపై ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి తరచుగా ఎదురవుతున్న బెదిరింపులు, దాడులు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత ఈ ఉద్రిక్తతలు
పెరిగాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో భారత దౌత్యవేత్తలు, భారతీయ ప్రజల భద్రతకు కెనడా ప్రభుత్వం భరోసా కల్పించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఇక ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే…..