
Kavitha’s Political & Family Problems: పొలిటికల్ గా , కుటుంబపరంగా తనకు ఇబ్బందుుల తలెత్తడానికి కారణమేంటో ఆమెకు తెలిసిపోయిందా? సమస్యకు మూలం ఎక్కడుందో కనిపెట్టారా?సమస్యకు కారణం ఏంటో కనుక్కున్నారా..అందుకు విరుగుడు కూడా మొదల పెట్టేశారా..ప్రస్తుత కార్యక్రమాలు పూర్తైయితే ఇక తన పొజిషన్ వచ్చేస్తుందని ఆమె ధీమాగా ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరు…ఆమె సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తున్నారు తెలుసుకోవాలంటే వాచ్ నౌ
BRS MLC కవిత మాటలు, ఆమె చేతలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..ఇంటా బయటా పలు ఇబ్బందులతో ఆమె తసమతం అవుతున్నారు. అది తాను చేతులారా కొని తెచ్చుకుంటున్న పరిస్థితులా, లేక పరిస్థితుల ప్రభావమా అన్న విషయాన్ని పక్కనబెడదాం. ప్రజెంట్ తన సమస్యలకు పరిష్కారం ఏంటీ అనే పనిలో బిజీగా ఉన్నారామే. తన అన్నతో పోటీ, తండ్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ రావడం, ఎక్కడికి వెళ్లినా పార్టీ శ్రేణులు గతంలో లాగా ఆదరించకుండా ముఖం చాటేయడం, అన్నిటికి మించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాను ఇరుక్కోవడం ఇలా సమస్యలన్నీ చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేయడానికి వాస్తు దోషమే ప్రధాన కారణమని కవిత భావిస్తున్నారంటూ సమాచారం.ముందు తన ఇంటి వాస్తును సెట్ చేస్తే తర్వాత సమస్యలన్నీ వాటంతటవే సర్దుకుంటాయని కవిత నమ్ముతున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.
అందుకే ఆలోచన వచ్చిందే తడవుగా కొట్టుడు కట్టుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో గతంలో ఎంపీగా ఉన్నప్పుడు హైదరాబాద్ గాంధీనగర్ లోని అపార్ట్ మెంట్ లో కవిత ఉండేవారు. ఆసమయంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఆమెకు సరైన నివాసం లేదన్నది కూడా ప్రచారాంశమైంది. ఆ తర్వాత బంజారాహిల్స్ నంది నగర్ లో ఆమె ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇక అక్కడే తేడా కొట్టిందన్నది ప్రస్తుతం ఆమె నమ్మకంగా తెలుస్తుంది. కొత్త ఇంట్లోకి వెళ్లిన రోజు నుంచి ఏదీ కలిసి రాలేదని ఆమె అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండేళ్ళ పాటు దగ్గరుండి ఎంతో ఇష్టంగా కట్టించున్న ఇంట్లోకి వెళ్ళాక కవితకు ఇబ్బందుుల స్టార్ట్ అయ్యాయని చెబుతుంటారు ఆమె అనుచరులు. ఇక కొత్త ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి ఈడీ, సీబీఐ కేసులతో సతమతం అయ్యారన్నది వాళ్ళ వాదన. అలా నందినగర్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె 6 నెలలు జైల్లు జీవితం గడిపారు. ఇక బెయిల్ మీద బయటికి వచ్చాక అదే ఇంట్లో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంతో హుషారుగా పాల్గొంటున్నా సరైన ప్రాధాన్యం దక్కడం లేదంటూ కవిత సీరియస్ అయ్యారు. వెంటనే తండ్రికి లేఖ రాశారు. Kavitha’s Political & Family Problems.
ఇక కేసీఆర్ దేవుడని..ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ పరోక్షంగా రక్త సంబంధీకులనే టార్గెట్ చేశారన్నది విస్తృతాభిప్రాయం. ఇక ఆ తర్వాత నుంచి కవిత పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందంటారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో పట్టించుకునే నాధుడే లేకపోవడంతో జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు గతంలో లాగా గులాబీ కేడర్ వెంట రావడం లేదు. కాస్తో కూస్తో ఆమె మీద అభిమానం ఉన్న నాయకులు కూడా భయంగా వచ్చి కలిసివెళ్తున్నట్లు సమాచారం. దీంతో కవిత పునరాలోచనలో పడ్డారు. అసలీ సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుందని వెతికే క్రమంలో ఓ సిద్ధాంతి వాస్తు బల్బు వెలిగించినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన సూచనల మేరకు ప్రస్తుతం ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు కవిత. నెల క్రితం తన ఇంటి పక్కనే ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటి ముందు గోడను తొలగించారు.
ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి మొదలు పెట్టిన జాగృతి కార్యాలయం ద్వారం కూడా పక్కకు మార్చారు. ఇక ఇంటి ప్రధాన ద్వారం స్థానాన్ని కూడా మార్చబోతున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఒక పక్కగా, వాయువ్య మూలలో ఉన్న ప్రధాన ద్వారాన్ని సెంటర్ కు మార్చబోతున్నారు. పైన ఉన్న సింహద్వారానికి ఎదురుగా ఈ ప్రధాన ద్వారం వచ్చేలా పెట్టాలన్నది ప్రస్తుతం జరుగుతున్న వాస్తు కరెక్షన్. అలాగే ఇంట్లో నుంచి జాగృతి కార్యాలయంలోకి వెళ్లడానికి కూడా స్పెషల్ ఎంట్రీ ఏర్పాటు చేస్తున్నారు.
రాబోయే శ్రావణమాసం లోపు ఈ వాస్తు మార్పులన్నీ పూర్తి చేయాలని కవిత ఆదేశించారు. ప్రస్తుతం తనకు బ్యాడ్ టైం నడుస్తోందని, త్వరలో మంచి రోజులు వస్తాయని కవిత సన్నిహితులతో అంటున్నారు. అప్పటికల్లా వాస్తు మార్పులతో రెడీగా ఉంటే ఇక తన రాజకీయాల కెరీర్ కు తిరుగుండదని భావిస్తున్నట్టు సమాచారం.